Skip to main content

prema entha madhuram today episode june 6 th

 Prema entha madhuram today episode :-

వర్థన్‌ ఫ్యామిలీని ఊరొదిలి వెళ్లిపోమ్మన్న స్వామి




 Today Serial Episode  :-   Prema Entha Madhuram  Serial Today Episode : వర్దన్‌ కుటుంబంలో వ్రతం చేయడానిని అన్ని ఏర్పట్లు చేస్తారు. ఊరి జనం కూడా వ్రతానికి వస్తుంటారు. అంతా హడావిడిగా ఉంటుంది. ఇంట్లో వ్రతానికి రెడీ అవుతున్న ఆర్య పంచె కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఇంతలో అను వచ్చి ఆర్యకు పంచె కడుతుంది. దీంతో ఆర్య అనుకు థాంక్స్‌ చెబుతాడు.

ఆర్య: మన ఇంట్లో ఎప్పుడు వ్రతం జరిగినా నువ్వు మహాలక్ష్మిలా నగలు వేసుకుని వ్రతంలో కూర్చునే దానివి. కానీ ఇప్పుడు

అను: సార్‌ నువ్వు పక్కన ఉండటమే నాకు పెద్ద అలంకారం ఇక నగలతో నాకేం పని రండి సార్‌.

 భానుకు తాకట్టు పెట్టమని ఇచ్చిన నగలు టేబుల్‌ మీద కనిపిస్తాయి. సార్‌ ఈ నగలు తాకట్టుపెట్టమని భానుకు ఇచ్చాము కదా అని అందులో ఉన్న లెటర్‌ చదువుతుంది. అందులో మా అక్క ఎప్పడు లక్ష్మీదేవిలా ఉండాలి అని రాసి ఉంటుంది. సరే అని ఇద్దరూ వ్రతానికి వెళ్తారు. వర్థన్‌ ఇంటి దగ్గరకు నీలకంఠం వస్తాడు. అటు ఇటు తిరుగుతుంటే.. అమ్మాయి కోసం చూస్తున్నారా? అని కోటి అడిగితే తల్లీకూతుళ్లను ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చానని మనం పెరట్లోకి వెళ్దాం పద అని వెళ్లిపోతారు. మరోవైపు లోపల వ్రతం జరుగుతుంటే దీపం ఆరిపోతుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో అక్కడ కిటికీ ఓపెన్‌ గా ఉంది అందుకే గాలి వచ్చి దీపం ఆరిపోయిందని కిటికి క్లోజ్‌ చేస్తాడు అజయ్‌. తర్వాత పూజ జరుగుతుంది. మరోవైపు వంటల దగ్గరకు వెళ్లిన నీలకంఠాన్ని వంటలు చేసే వ్యక్తి ఇక్కడికి ఎందుకొచ్చారని అడుగుతాడు.

నీలకంఠం: అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూడటానికి వచ్చాము. ఇంతకీ ఏంమేం చేస్తున్నారు.

వంటల వ్యక్తి: పాయసం, పులిహోర, సాంబారు, పప్పు అన్నం. వ్రతానికి ఇంకేం చేస్తామండి.

నీలకంఠం: మంచిది మంచిది నువ్వు త్వరగా చేసుకో..

కోటి: భోజనాల కోసం ఇక్కడే గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నట్లు ఉంది వెళ్లిపోదాం పదండి అయ్యగారు.

నీలకంఠం: ఎక్కడికిరా వెళ్లేది. అసలు మనం చెడగొట్టాల్సింది వంటలనే. ఈ భోజనాలు కల్తీ అయిపోవాలి. ఊరి జనాలు మొత్తం పస్తులుండాలి. ఆ ఆర్యను అందరూ దుమ్మెత్తిపోయాలి. నువ్వు వెళ్లి నేను చెప్పినట్లు చేయ్‌.



కోటి: దేవుడి కోసం చేసిన పూజల్లో జనాలకు తిండి లేకుండా చేస్తే పాపం అండి.

అనగానే నువ్వు నేను చెప్పింది మాత్రమే చేయ్‌ అంటూ నీలకంఠం వంటలు ఎలా చెడగొట్టాలో కోటికి చెప్తాడు. కోటి చెయ్యనని చెప్పినా బలవంతంగా చెయ్యమంటాడు. కోటి చేయడు. దీంతో నీలకంఠం వంటలు చెడగొట్టబోయి చేతులు కాల్చుకుంటాడు. మరోవైపు అవధూత స్వామి ఇంటి బయట నిలబడి కిటికీలోంచి వ్రతం చూస్తూ ఏదేదో మాట్లాడుతుంటే శారదాదేవి వచ్చి ఆయన కాళ్లు మొక్కుతుంది.

శారద: నిన్న మీరు వచ్చి మా ఆర్యను హెచ్చరించారు. అప్పటి నుంచి నా మనసు ఏం బాగాలేదయ్యా. ఇప్పుడు కూడా మా ఆర్య, అనులను చూసి మీరు ఏదో అంటున్నారు. ఏదైనా సమస్య ఉందా? ఉంటే ఆ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే చెప్పండయ్యా?

స్వామి: వెళ్లిపోండి ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోండి. ఈ పూజలు వ్రతాలు అన్ని వృథా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. దేవుడున్నాడే పెద్ద మాయగాడు. అంతా మాయ చేస్తాడు. నాటకం జరగుతుంది. జగన్నాటకం కాలం దాని మాయ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ ప్రయత్నించు కాలానికి ఎదురీదు. కాపాడుకో.. వెళ్లిపోండి..

 అని స్వామి వెళ్లిపోతాడు. ఆయన దేని గురించి హెచ్చరిస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒక్కటీ అను, ఆర్యలను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది శారదాదేవి. మరోవైపు వంటల దగ్గర నీలకంఠం వంటలు చేసేవాళ్లను అందర్నీ అక్కడి నుంచి  పంపించి వంటలన్నీ చెడగొడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం